ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బీజేపీ నాయకులు
మన భారత్, ఆదిలాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) గౌ. శ్రీ గోడం నగేష్ కి జిల్లా బీజేపీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు తాటిపెల్లి గంగాధర్ రాజు, కనపర్తి చంద్రకాంత్, కాటిపెల్లి వసంత్ రెడ్డి, మహేందర్ యాదవ్, బోండ్ల వెంకట స్వామి, శైలందర్, మగ్గిడి ప్రకాష్, శ్రీకాంత్, లింగన్న తదితరులు ఎంపీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ఎంపీ నాయకత్వంలో జిల్లా అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎంపీ ఎల్లప్పుడూ ముందుంటూ సేవలందిస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఎంపీ పాత్ర కీలకమని తెలిపారు.
ఎంపీ గౌ. శ్రీ గోడం నగేష్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.