మన భారత్ ‘విశ్వ గురువు’ కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచ సంక్షేమం కోసం భారత్ ‘విశ్వ గురువు’ కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మన భారత్, హైదరాబాద్: ప్రపంచ సంక్షేమం దిశగా భారత్ ‘విశ్వ గురువు’గా ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఐక్యంగా నిలిచి భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో భాగవత్ మాట్లాడారు. “ప్రపంచం ఈ రోజు భారత్ వైపు ఆశతో...