manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 2:11 am Editor : manabharath

ఎమ్మెల్యే పీఆర్వో మజర్ కు జన్మదిన శుభాకాంక్షలు..

సోషల్ మీడియాలో మరింత రాణించాలి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్

మన భారత్, బోథ్:
సోషల్ మీడియాను ప్రజలతో అనుసంధానంగా ఉపయోగిస్తూ మరింత రాణించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. బుధవారం ఎమ్మెల్యే పీఆర్వో మజర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా చేరవేస్తూ, సోషల్ మీడియా వేదికగా చురుకుగా స్పందిస్తున్న మజర్ సేవలు అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమతుల్యంగా వ్యవహరించడం వల్ల మజర్‌కు మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో పని చేస్తూ సోషల్ మీడియాలో మరింత ప్రభావవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మజర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.