manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 3:18 pm Editor : manabharath

ప్రజా ప్రతినిధులను సన్మానించిన మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ..

కప్పర్ల గ్రామ నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం

మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కప్పర్ల గ్రామానికి చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డలు గండ్రత్ అరుణ్ కుమార్ సర్పంచిగా, భారే నర్సింగు ఉపసర్పంచిగా ఎన్నికైన సందర్భంగా మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు జిమ్మ ఆడేళ్లు, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ఆశన్నతో పాటు మున్నూరు కాపు కుల బంధువులు పాల్గొన్నారు. నూతన ప్రజాప్రతినిధులకు మిఠాయిలు తినిపించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని, మున్నూరు కాపు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.