manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 3:13 am Editor : manabharath

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం

మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు సాయి కిరణ్ యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షల్లో ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. సాయి కిరణ్ సాధించిన ఈ ఘన విజయాన్ని గుర్తిస్తూ పొన్నారి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన సాయి కిరణ్ యువతకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారని అభినందించారు. విద్య, పట్టుదల, లక్ష్య సాధనతోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.

సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని సాయి కిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో దేశ సేవలో కీలక బాధ్యతలు నిర్వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.