అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది..
జి.మాడుగులలో 5.3°C… ఉత్తర కోస్తా–ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి
మన భారత్, ఏపీ డెస్క్: రాష్ట్రాన్ని చలి పట్టిపీడిస్తోంది. ఉదయం పూట తీవ్రమైన చలితో ప్రజలు ఇళ్లలోనే వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జి.మాడుగుల మండలంలో కనిష్ఠంగా 5.3 డిగ్రీల సెల్సియస్ నమోదై ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ నమోదు చేసింది.
ఇదిలా ఉంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి దంచికొడుతోంది.
- ముంచంగిపట్టు – 7.7°C
- డుంబ్రిగూడ – 8.2°C
- అరకు – 8.9°C
- చింతపల్లి – 9.5°C
- హుకుంపేట – 9.6°C
ఆంధ్రా పర్వత ప్రాంతాలతో పాటు తెలంగాణలోని కొండచరియల ప్రాంతాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. HYDలోని HCU వద్ద 9°C, BHELలో 10.6°C నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ ప్రకారం, ఈశాన్య గాలుల ప్రభావంతో రాబోయే కొన్ని రోజులు తెల్లవారుజామున చలి మరింత పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. పర్వత ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.