manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 10:43 pm Editor : manabharath

TVK సభకు పోలీసుల ఆంక్షలు – 5 వేల మందికే అనుమతి.!

💥 TVK సభకు పోలీసుల ఆంక్షలు – 5 వేల మందికే అనుమతి.!

మన భారత్, పుదుచ్చేరి: పుదుచ్చేరిలో రేపు జరుగనున్న TVK పార్టీ చీఫ్ విజయ్ సభపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. భారీ జనసందోహం, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం 5 వేల మందికే ప్రవేశం కల్పించనున్నట్లు స్పష్టంగా ప్రకటించారు.

🔹 QR కోడ్ పాస్ ఉన్నవారికే ఎంట్రీ

TVK జారీ చేసిన QR కోడ్ పాసులు కలిగిన స్థానికులకే సభలో ప్రవేశం ఇస్తామన్న పోలీసులు,

అనుమతి లేని ఎవరూ సభ ప్రాంగణంలోకి రానీయబోమని చెప్పారు.

🔹 పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు నో ఎంట్ర

 

భద్రతా కారణాల వల్ల—

 

* పిల్లలు

* గర్భిణీలు

* వృద్ధులు

ఈ సభకు హాజరు కావద్దని పోలీసులు స్పష్టంగా నిరోధం విధించారు.

🔹 తప్పనిసరిగా ఉండాల్సిన ఏర్పాట్లు

సభ నిర్వహణ కమిటీకి పోలీసులు ఇచ్చిన ఆదేశాలు:

* తాగునీటి సౌకర్యం

* మరుగుదొడ్లు

* అంబులెన్స్‌లు

* ఎమర్జెన్సీ ఎగ్జిట్లు

 స్టేజ్ మరియు ప్రేక్షకుల ప్రాంతాల్లో సేఫ్టీ మార్గదర్శకాలు

🔹 కరూర్ ఘటన మళ్లీ జరగకుండా జాగ్రత్తలు

ఇటీవల కరూర్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో,ఏ తప్పిదం జరగకుండా పోలీసులు అదనపు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.జనాల రాకపోకలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుంది.

ఈ నేపథ్యంలో TVK అనుచరులు, విజయ్ అభిమానులు సభ నియమాలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.