మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా” — ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్రెడ్డి సంచలన హెచ్చరిక
మన భారత్, తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి వేడెక్కే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ… తెలంగాణ ప్రజలు తనకు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేటలో రూ.508 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ధ్వజమెత్తారు.
మోదీ–కేసీఆర్పై రేవంత్ ఫైర్
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డు పడుతోంది. మా రాష్ట్రానికి రావాల్సిన హక్కులను నిర్లక్ష్యం చేస్తోంది’ అని రేవంత్ మండిపడ్డారు.
“నా వయసు ఉంది… ఓపిక ఉంది… ఢిల్లీలో నిలదీస్తా. మీరు ఆశీర్వదిస్తే కేంద్రం వైఖరిని మార్చక తప్పదు”** అని ఆయన స్పష్టం చేశారు.
“మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు” — జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్పై విమర్శలు
జూబ్లీహిల్స్ ఎన్నిక బీఆర్ఎస్కు బండకేసిన తీర్పని రేవంత్ పేర్కొన్నారు.
“అభివృద్ధి జరగాలంటే మంచి సర్పంచ్ను ఎన్నుకోండి.”
“స్థానిక సంస్థల ఎన్నికల్లో క్వార్టర్–హాఫ్కి ఓటు వేయొద్దు.”
“గ్రామాల్లో యువకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయండి.”
కేసీఆర్ వరంగల్ ఎయిర్పోర్ట్పై ఏనాడూ ఆలోచించలేదని తప్పుబట్టిన రేవంత్… “మార్చి 31లోపు వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం” అని హామీ ఇచ్చారు.
గడీ పాలనను ప్రజలు కూలగొట్టారు
గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వం ప్రజల కోసం కాదు, స్వప్రయోజనాల కోసం జరిగిందని ఆరోపించారు.
వరి పండిస్తే ప్రతిగింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
డబుల్ బెడ్రూమ్ మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లక్షల మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు.
“నర్సంపేటకు ఏప్రిల్లోపు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం” అని ప్రకటించారు.
వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తాం
రేషన్ కార్డులు, సన్నబియ్యం, 24 గంటల కరెంటు, వ్యవసాయ విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను సీఎం వివరించారు.
సమ్మక్క–సారలమ్మ వీరవనితల స్ఫూర్తితో పాలన ముందుకు సాగుతోందని అన్నారు.
ఆడబిడ్డలకు చీర, సారె — మహిళల సాధికారతపై పట్టు
18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీర, సారె అందజేస్తామన్నారు.
కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యం.
త్వరలో మహిళల ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్లోకి తీసుకువెళ్లే చర్యలు.
ఉద్యోగాలు, రోడ్లు — యువతకు కీలక పిలుపు
త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.
గ్రామాల్లో రాజకీయ కక్షలకు యువత బలి కాకూడదని హెచ్చరిక.
రూ.20,000 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి ప్రారంభమవుతుందని తెలిపారు.