వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్ ధీమా – పల్లెల్లో తిరిగి మంచి రోజులు వస్తాయి
మన భారత్, తెలంగాణ:
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకోవడంతో, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “వచ్చేది మన ప్రభుత్వమే” అంటూ ధీమాగా వెల్లడించారు.
“కష్టాలు వచ్చినా వెరవద్దు”
కేసీఆర్ మాట్లాడుతూ—
దేశం, రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రోజులు ఒకేలా ఉండవన్నాడు.
“మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు… కొన్ని కష్టాలు వచ్చినా వెరవకూడదు. ప్రజలు మళ్లీ మన వైపే చూస్తారు” అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలకు నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ చూపిందని, పల్లెల్లో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ ఏం చేస్తుందో చూస్తూ ఆగిపోవద్దు”
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ విమర్శించారు.
– “ఎవరో ఏదో చేస్తారని ఆగి చూడకూడదు,”
– “ప్రజల కోసం మనం పనిచేయడం ఆపకూడదు,”
అని పార్టీ నాయకులకు సూచించారు.
పల్లెలలో ప్రజల సమస్యలను తెలుసుకొని, వారితో మమేకం కావాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
