manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 2:14 am Editor : manabharath

భక్తి శ్రద్ధలతో సిల్వర్ జూబ్లీ వేడుకలు

సాయిలింగిలో సాయిబాబా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయిబాబా ఆలయ 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ముత్యం రెడ్డి, వారి సతీమణి ఆలయానికి విచ్చేసి సాయిబాబా దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన ముత్యం రెడ్డి… “సాయిబాబా అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామాలకు ఆధ్యాత్మిక బలం ఇస్తాయి” అని పేర్కొన్నారు.

ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు విజయవంతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట శివాజీ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ వాతావరణం భక్తి రసపూరితంగా మారి జూబ్లీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.