రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి బిగ్ షాక్ — సంగారెడ్డిలో కొత్త రాజకీయ సమీకరణలు!
మన భారత్ – తెలంగాణ డెస్క్, సంగారెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోనని, తన స్థానంలో భార్య నిర్మలను రంగంలోకి దించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద షాక్గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సంగారెడ్డి రాజకీయాల్లో కీలక స్థానం కలిగిన జగ్గారెడ్డి ఈ అకస్మిక నిర్ణయంతో పార్టీ నాయకత్వంలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎందుకు పోటీ నుంచి తప్పుకుంటున్నారు? ఈ ప్రకటన వెనుక ఏ ఆంతర్యం ఉంది? అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తన కుటుంబ సభ్యురాలిని ఎన్నికల రంగంలోకి తీసుకురావడం వెనుక ఎన్నో రాజకీయ లెక్కలు ఉన్నాయని స్థానిక నాయకులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ నిర్ణయం భవిష్యత్తులో సంగారెడ్డి కాంగ్రెస్లో కొత్త శక్తి సమీకరణలకు దారితీసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జగ్గారెడ్డి నిర్ణయం ప్రకటించడంతో కాంగ్రెస్లో హల్చల్ మొదలై, రాబోయే రోజుల్లో దీనిపై ఇంకా పెద్ద చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.