manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 11:27 am Editor : manabharath

“లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ : సజ్జల

‘లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ – సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, విచారణలో పారదర్శకత లేదంటూ విమర్శ

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న వివాదం మరింత రాజకీయ రంగు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ, నెయ్యి కల్తీ విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు.

“కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. తిరుమల లడ్డూ విషయంలో మేము ఎప్పుడూ రాజీపడలేదు. అదే కంపెనీలు అప్పుడు కూడా నెయ్యి సరఫరా చేసాయి, ఇప్పుడు కూడా వాటే కంపెనీలు అందిస్తున్నాయి. అంటే కల్తీకి ఎక్కడ అవకాశముంది?” అని సజ్జల ప్రశ్నించారు.

అంతేకాక, సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించిన సజ్జల… ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విచారణలో పూర్తిస్థాయి పారదర్శకత అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.