నేడు కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి — గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపన
మన భారత్, తెలంగాణ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ ను సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన, పోషకాహారం తో కూడిన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 ప్రభుత్వ పాఠశాలలలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో, ఇదే నమూనాను మధ్యాహ్న భోజనానికి కూడా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ద్వారా, వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ శుభ్రంగా, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల పోషకాహార ప్రమాణాన్ని మరింతగా పెంచే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషించనుంది.