తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షుల నియామకం పూర్తి
ఏఐసీసీ విడుదల చేసిన పూర్తి జాబితా
మన భారత్, న్యూఢిల్లీ: తెలంగాణలో జిల్లాలవారీగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్గనైజేషన్ బలోపేతం, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మొత్తం 33 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ఈ జాబితా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో చురుకుదనం నింపింది. కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఆదిలాబాద్ – డా. నరేష్ జాదవ్
- కుమ్రం భీం ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ
- భద్రాద్రి కొత్తగూడెం – దేవి ప్రసన్న
- భువనగిరి – బీర్ల ఐలయ్య
- గద్వాల – రాజీవ్ రెడ్డి
- హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి
- హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్లా
- జగిత్యాల – నందయ్య
- జనగాం – ధన్వంతి
- జయశంకర్ భూపాలపల్లి – కరుణాకర్
- కామారెడ్డి – మల్లికార్జున ఆలే
కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలపడటానికి ఈ నియామకాలు తోడ్పడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.