మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఫాతిమా బోష్కు
మన భారత్, బ్యూటీ: థాయలాండ్ వేదికగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్–2025 సౌందర్య పోటీల్లో ఈసారి విజేతగా నిలిచింది మెక్సికో అందాల భామ ఫాతిమా బోష్. గ్లోబల్ స్టేజ్పై తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఆకట్టుకున్న ఆమెకు విశ్వసుందరి కిరీటం వరించింది.
భారత్ తరఫున రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మొదట టాప్ 30లో స్థానం దక్కించుకొని మంచి ప్రతిభ కనబరిచిన మణిక, చివరికి టాప్ 12లో నిలిచినా ఫైనల్స్కు చేరుకోలేకపోయారు. దేశాన్ని ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించినందుకు ఆమెకు దేశీయంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతీ ఏడాది జరిగే ఈ సౌందర్య పోటీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే గ్లోబల్ ఈవెంట్. మోడలింగ్, సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న ఫాతిమా బోష్ విజయం ప్రస్తుతం అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో ప్రధాన చర్చగా మారింది.