విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కుట్ర… కేంద్రంతో చేతులు కలిపిన బాబు: మాజీ మంత్రి రజినీ ఆరోపణలు
మన భారత్, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (VSP) ప్రైవేటీకరణపై రాజకీయ వేడి మరోసారి పెరిగింది. కేంద్రంతో కుమ్మక్కై ప్లాంటును ప్రైవేటు చేతులకు అప్పగించే కుట్రలు చేస్తున్నారని TDP అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి రజినీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల బాబు చేసిన ‘వైట్ ఎలిఫెంట్’ వ్యాఖ్యలే ఆయన అసలు ఉద్దేశ్యానికి నిదర్శనమని రజినీ విమర్శించారు.
NDAలో భాగం కాకపోయినా, జగన్ ప్రభుత్వం సమయంలో ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP మద్దతుతో నడుస్తుండటంతో ఆ దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని రజినీ భగ్గుమన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రజల ఆస్తిగా కాపాడటానికి అందరూ ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.