కేవలం 1 రూపాయికే ఫ్లైట్ టికెట్ .. ఇండిగో బంపర్ ఆఫర్, నవంబర్ 30, 2025 వరకే
మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ప్రముఖ ఎయిర్లైన్స్ ఇండిగో మరోసారి ప్రయాణికులను ఆకట్టుకునే ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పసిపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు భారీ ఊరటగా ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో ప్రత్యేక సేల్ను ప్రకటించింది. ఏడాది లోపు వయసున్న శిశువులకు కేవలం 1 రూపాయికే విమాన టికెట్ అందుబాటులోకి తెస్తూ ఇండిగో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ ఆఫర్తో తల్లిదండ్రులు దాదాపు ₹1,750 వరకు ఆదా చేసుకోవచ్చని ఇండిగో వివరించింది. అయితే ఈ సౌకర్యం కేవలం ఇండిగో అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర బుకింగ్ ప్లాట్ఫారమ్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు.
వయస్సు నిర్ధారణ తప్పనిసరి
టికెట్ బుకింగ్ సమయంలో పిల్లల వయస్సును చెక్-ఇన్ కౌంటర్ వద్ద నిర్ధారించాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రింది వాటిలో ఏదైనా ఒకటి చూపాలి:
* బర్త్ సర్టిఫికెట్
* వ్యాక్సినేషన్ కార్డు
* హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ
* పాస్పోర్ట్
దేశీయ విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణం
ఈ ఆఫర్తో 1 రూపాయికే తీసుకున్న ఇన్ఫాంట్ టికెట్తో దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పసిపిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండిగో వెల్లడించింది. ఆఫర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇండిగో అధికారిక వెబ్సైట్లోని Deals & Offers విభాగంలో ప్రకటించింది.
చివరి తేదీ — నవంబర్ 30, 2025
ఈ బంపర్ ఆఫర్ 30 నవంబర్ 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రయాణాలు ప్లాన్ చేస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.