manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 7:51 am Editor : manabharath

అనంతలోకాలకు అందెశ్రీ..

అనంతలోకాలకు అందెశ్రీ.. తెలంగాణ గీత గాయకుడి కన్నుమూత

హైదరాబాద్, నవంబర్ 10: “జయజయహే తెలంగాణ జననీ జయకేతనం…” అంటూ తెలంగాణ ఆత్మగీతాన్ని ప్రపంచానికి చాటిన గాత్రం ఇక వినిపించదు. ప్రజాకవి, గేయరచయిత, గాయకుడు అందెశ్రీ (Andesri) ఈరోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన సృజనాత్మకత, కవిత్వం, గానం మొత్తం కలిసి తెలంగాణ చరిత్రలో చెరగని ముద్రవేశాయి. రాష్ట్ర ఆవిర్భావ దశలో తెలంగాణ జాతి గౌరవాన్ని పెంపొందించిన ఆయన రచనలు నేటికీ మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

“పల్లె నీకు వందనాలమ్మో”, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు”, “జనజాతరలో మన గీతం” వంటి గేయాలతో అందెశ్రీ ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచారు. ఆయన పద్యాలు, గీతాలు కేవలం పదాలు కాదు – అవి తెలంగాణ మట్టిలోంచి పుట్టిన గళం, శ్రమజీవుల కష్టాల ప్రతిబింబం.

సాహిత్యంతో సమాజాన్ని జాగృతం చేసిన అందెశ్రీ, కేవలం కవి కాదు — ఉద్యమకారుడు, సాంస్కృతిక యోధుడు. తెలంగాణ గీతం రాష్ట్ర చిహ్నంగా మారి, ఆయన పేరు శాశ్వత గౌరవస్థానాన్ని పొందింది.

ఆ గొంతు ఇక మూగబోయినా… ఆయన గీతాలు, ఆయన తత్త్వం ఎన్నటికీ మాయమవ్వవు.

తెలంగాణ ఆత్మకు స్వరమైన అందెశ్రీకి మన భారత్ యాజమాన్యం తరుపున శ్రద్ధాంజలి.