కొడంగల్లో అక్షయపాత్ర సదుపాయం..
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్న ఫౌండేషన్ మన భారత్, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి నవంబర్ 14న కొడంగల్లో జరగనున్న గ్రీన్ఫీల్డ్ కిచెన్ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించారు. కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో ఈ గ్రీన్ఫీల్డ్...