ఆన్లైన్ బెట్టింగ్.. యువ కానిస్టేబుల్ దుర్మరణం
ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో యువ కానిస్టేబుల్ దుర్మరణం మన భారత్, సంగారెడ్డి, నవంబర్ 4: ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మత్తు మరో కుటుంబాన్ని కూలదోసింది. సంగారెడ్డి జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద సందీప్ (కానిస్టేబుల్) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పోలీసు వర్గాలు షాక్కు గురయ్యాయి. సంగారెడ్డి టౌన్ పోలీస్స్టేషన్లో ఏడాదిగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ గ్రామానికి చెందినవాడు. గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పట్ల అతనికి...