బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రేపు పలు మండలాల్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్ | నవంబర్ 2: బోథ్ నియోజకవర్గ ప్రజల వ్యవసాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (సోమవారం, నవంబర్ 3) పలు మండలాల్లో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులకు సకాలంలో పంట కొనుగోలు సదుపాయం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.
ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయం 10.00 గంటలకు నేరడిగొండ మండల కేంద్రంలో మొక్కజొన్న , సోయాబీన్ కొనుగోలు కేంద్రం, ఉదయం 10.30 గంటలకు బోథ్ మండల కేంద్రంలో, 11.10 గంటలకు ఇచ్చోడ మండలంలో సోయా కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు.
తరువాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివాహ శుభకార్యాలలో పాల్గొని రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తాంసి మండల కేంద్రంలో, 2.00 గంటలకు భీంపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లో, 3.00 గంటలకు తలమడగు మండల కేంద్రంలో నూతన ఫంక్షన్ హాల్ ను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు భారీగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.