ప్రకృతి ఒడిలో పచ్చని పూలదండలా మెరిసే సోయగం
జిల్లా కలెక్టర్ రాజర్షి షా కృషి.. వాగు అందాలు కమనీయం మన భారత్, ఆదిలాబాద్ : తాంసి గ్రామ పరిసరాల్లో ప్రవహించే మత్తడి వాగు ప్రకృతి సోయగాలతో కన్ను తిప్పుకోనీయకుండా మురిపిస్తోంది. వాగు ఒడ్డున పచ్చని చెట్లు, నీలి ఆకాశం ప్రతిబింబమై నీటిపై అలరారుతూ అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలి వర్షాలతో వాగు నీటిమట్టం పెరగడంతో పరిసరాలు మరింత పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ వాగు తీరానకు వచ్చే గ్రామస్థులు, పర్యాటకులు ఆ అందాలను...