“సార్… మా పంట కొనండి” పోలీసుల కాళ్లు పట్టుకున్న రైతులు!
కామారెడ్డి జిల్లాలో వడ్లు కొనకపోవడంతో ఆవేదనకు గురైన రైతులు — పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం నస్రుల్లాబాద్, (మన భారత్ బ్యూరో): రైతులు పండించిన ధాన్యాన్ని కొనకపోవడంతో ఇద్దరు రైతులు ఆవేదనకు గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే— నస్రుల్లాబాద్ మండలంలోని పలువురు రైతులు తమ వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల సూచనల మేరకు సొసైటీ...