ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం
వ్యయం 12% తగ్గనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. “ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి సుందిళ్ల లింక్ ద్వారా...