బోధన్లో ఆర్టీసీ బస్సు బీభత్సం..
మున్సిపల్ సిబ్బంది నాగమణి దుర్మరణం స్థానికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదనతో ధర్నా బోధన్, అక్టోబర్ 27: బోధన్ పట్టణం ఉదయం వేళ ఘోర రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు మున్సిపల్ సిబ్బంది నాగమణి (38)ను ఢీకొట్టి తీవ్ర గాయాలు కలిగించింది. వెంటనే సహచర ఉద్యోగులు, స్థానికులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నాగమణి మృతిచెందింది. నాగమణి బోధన్...