శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం
కార్తీకమాసంలో దర్శనమాత్రాన మోక్షప్రాప్తి కలిగించే పవిత్ర క్షేత్రం మన భారత్, శ్రీశైలం: కార్తీకమాసం దేవాలయాల సౌందర్యం, దీపాల వెలుగులు, భక్తి కాంతులు నిండిన పవిత్ర మాసం. ఈ మాసంలో ఒక్కసారి దర్శించినా మోక్షం ప్రసాదించే క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండో జ్యోతిర్లింగమైన శ్రీ మల్లికార్జున స్వామి, శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే శ్రీశైలం “భువిలో వెలసిన కైలాసం”గా ఖ్యాతి పొందింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో వెలసిన...