గుడిహత్నూర్లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు
సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు
మన భారత్, సెప్టెంబర్ 12, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పనుల నేపథ్యంలో వాహనాలను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించడంతో ట్రాఫిక్ రద్దీ ఒక్కసారిగా పెరిగి సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు తమ వాహనాలను అక్కడే నిలిపి కాలినడకన ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేకంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు ట్రాఫిక్ జామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు సైతం సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. రహదారి పనులు చేపట్టే సమయంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొన్నారు.
జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రహదారి పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత సిబ్బందిని అందుబాటులో ఉంచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా సర్వీస్ రోడ్డుపై వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని, రహదారి పనులను వేగంగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారి పనులను సమన్వయంతో నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
