విధుల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: గణేశ్
పునగూడ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు తలమడుగు:మన భారత్, సెప్టెంబర్3, మండలంలోని పునగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ గురువారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గణేశ్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని ఆయన అధికారులను కోరారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించడంతో...