ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల అంశాలపై సమీక్షించారు. సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్బంగా డిఎస్పీ సంపత్ రావు మాట్లాడుతూ ,పోలీస్ స్టేషన్ నిర్వహణ అధికారుల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని. కేసుల దర్యాప్తు లో వేగం పెంచాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, కేసులో పరిష్కారం త్వరత్వరగనా అయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. వార్షిక తనిఖీలో ఎస్ ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
