manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 2:24 am Editor : manabharath

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు

మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు గడువు సోమవారంతో ముగియాల్సి ఉంది. అయితే ఇంకా పలువురు అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయామని, మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత మంది అర్హులకు అవకాశం

చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అదనపు సమయం ఇవ్వడంతో అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు సమర్పించారు.

ఆగస్టు 31 నాటికి దాదాపు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గడువు పొడిగింపుతో మరింత మంది అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది.

సెప్టెంబర్ 15 చివరి గడువు

కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత మరలా అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం గడువు పొడిగించడంతో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.