ఘనంగా సద్గురు సాయి బాబా పల్లకి ఊరేగింపు..
తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలో శ్రీ సద్గురు సాయి బాబా పల్లకి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాయి దీక్షాపరులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లకి సేవను విజయవంతం చేశారు. సాయి బాబా పల్లకిని పూలతో అందంగా అలంకరించి ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి భక్తిపూర్వకంగా స్వాగతం పలికారు. సాయి బ్యాండ్ మేళాల నడుమ భక్తులు సాయిబాబా నామస్మరణ చేస్తూ, భజనలు మరియు భక్తి గీతాలు ఆలపిస్తూ...