కళాశాలల ఫలితాలపై ప్రత్యేక మానిటరింగ్ కమిటీ..
మన భారత్, ఆగస్టు,25 ఆదిలాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా అకడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, బోధన, సిలబస్ పూర్తి, విద్యార్థుల ప్రగతి వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ అవసరమైన...