manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 10:32 pm Editor : manabharath

రూ. 50 వేల సామాగ్రి పంపిణీ..

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కజ్జర్ల సర్పంచ్ 50 వేల సామాగ్రి పంపిణీ

మన భారత్,ఆగస్టు,25 తలమడుగు: గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మ నారాయణరెడ్డి తనవంతు సహాయాన్ని అందించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని సమకూర్చారు.

గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు చిన్నారులకు అవసరమైన ఫ్యాన్లు, కూలర్లు తదితర సామగ్రిని అందించారు. సుమారు రూ.50 వేల విలువైన సామగ్రిని గ్రామస్థుల సమక్షంలో అంగన్వాడీ టీచర్లకు అందజేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో వేసవి వేడి, ఉక్కపోత సమయంలో చిన్నారులకు కొంత ఉపశమనం కలగడంతో పాటు మెరుగైన వాతావరణం ఏర్పడనుంది.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్మ నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపడితే చిన్నారులకు మరింత అనుకూలమైన వాతావరణంలో సేవలు అందించవచ్చన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సేవలకు తోడుగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తే అంగన్వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేయవచ్చని సర్పంచ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ చిన్నారుల సంక్షేమం, గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఫ్యాన్లు, కూలర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడంపై అంగన్వాడీ టీచర్లు, గ్రామస్థులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు విద్య, ఆరోగ్యం, బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి