ఎస్సీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో అవకాశం..
మన భారత్, ఆదిలాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గాలకు చెందిన వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, విధానాలు, కాంట్రాక్టు పనులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో ఎస్సీ వర్గాలకు చెందిన...