అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ
తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని తలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 300 కిలోల పిడిఎస్ బియ్యంతో పాటు మహీంద్రా మ్యాక్స్ ఫెస్టారా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. సుంకిడి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 22న పిడిఎస్ బియ్యాన్ని...