కిన్నర్ల మల్లేష్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు
మన భారత్, బజార్హత్నూర్, ఆగస్టు 22: బజార్హత్నూర్ మండలం వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన కిన్నర్ల మల్లేష్రెడ్డి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి కుటుంబాన్ని పరామర్శించారు.
మల్లేష్రెడ్డి నివాసానికి వెళ్లిన రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లేష్రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. మల్లేష్రెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.
రాథోడ్ బాపురావు పరామర్శతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ వారికి అండగా నిలవడం నాయకుల బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో గుంజల భాస్కర్రెడ్డి, డాక్టర్ అంకుష్, విట్టల్, మోహన్, మహేష్, సంతోష్, లక్ష్మణ్, ఆనంద్, చారి, రమేష్, శ్రీకాంత్, రాజేందర్ తో పాటు గ్రామ పెద్దలు, తెలంగాణ రక్షణ సేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
