manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 9:30 pm Editor : manabharath

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి..

కుచులాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ

తలమడుగు,మన భారత్ ఆగస్టు 22: తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న షూలను పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులకు యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలతో పాటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం ఆనందంగా ఉందని తెలిపారు.

విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు హాజరై చదువుపై దృష్టి సారించేలా అవసరమైన సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.

పిల్లలకు చిన్న వయసు నుంచే విద్యతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధికి గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు.

షూల పంపిణీ కార్యక్రమంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోడేపు వెంకన్న, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.