మన భారత్,తలమడుగు, ఆగస్టు 20: తలమడుగు మండల కేంద్రంలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏలుగు రాజన్న (చంటి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏలుగు రాజన్న మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్తో పాటు సంబంధిత సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గజానన్, పీవో గంగన్న, రేషన్ డీలర్ పరుశురాం, లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
