manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 11:28 pm Editor : manabharath

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మొగుళ్ళపల్లి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కరించుకుని బుధవారం మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ- రవీందర్,ఎస్ ఐ ముప్పు సురేష్ లకు శాలువాతో ఫోటోగ్రాఫర్ యూనియన్ సంఘం నాయకులు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు నాసాని విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సర ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ జరుపుకున్నట్లు తెలిపారు. ఒక ఫోటో వెయ్యి మాటలకు సమాధానమంటారని, కాలగర్భంలో కలిసిపోయే, మధుర జ్ఞాపకాలకు చారిత్రక ఘట్టాలను, సామాజిక పరిస్థితులను కళ్ళముందే నిలిపే గొప్ప మాధ్యమం ఫోటోగ్రఫీ అని తెలిపారు. సమాజంలోని సమస్యలను ప్రజల కష్టాలను విజయాలను సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్