manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 6:57 am Editor : manabharath

న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

మొగుళ్లపల్లి, నవాబుపేట, జడల్పేట లో జరిగిన న్యాయ అవగాహనా సదస్సులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ఉపయోగించి మొగుళ్లపల్లి రైతు వేదిక, బస్స్టాండ్, నవాబుపేట , జడల్పేట గ్రామాల్లో న్యాయ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందగోరెవారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు, ప్రామిసరి నోట్ వివాదాలు, కుటుంబ వివాదాలు, సివిల్ కేసులు, మరియె ఇతర కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడేవారు జిల్లా న్యాయ సేవధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు.
సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ
కేసుల్లో రాజీ మార్గాన్ని పాటించాలని, కేసులు పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాలు లేని సోదరా భావంతో జీవించాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో మొగుళ్లపల్లి ఎం. పి. డి. వో సురేందర్, సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కే. వెంకటేష్, ఎమ్. రాజ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్లు మంగళపల్లి శ్రీనివాస్, బండారి రామస్వామి, తిరుపతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.