532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..
ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 532 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న అందిన విశ్వసనీయ సమాచారంతో లక్ష్మీ సాయి గార్డెన్ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి సుమారు 7:20 గంటల సమయంలో బైక్పై వచ్చిన నడికూడ మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సిద్ధును...