manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 1:16 pm Editor : manabharath

TRP పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..

మాదం రజినీ కుమార్‌ను కలిసిన TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవడం వంటి అంశాలపై చర్చించారు.

పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహిస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసి, తెలంగాణ రాజ్యాధికార సాధన కోసం ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామని నాయకులు తెలిపారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.