manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 4:25 pm Editor : manabharath

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

అనారోగ్యంతో బాధపడుతున్న వైష్ణవిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

తలమడుగు మన భారత్, జూలై 25: తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన గడుగు పొచ్చన్న కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా వైష్ణవి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను రాథోడ్ బాపురావు అడిగి తెలుసుకున్నారు. వైష్ణవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యతలో భాగమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో గజానంద్ షిండే, రాజు, రమేష్, శ్రీనివాస్ శాస్త్రి, స్వామి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..