manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 2:18 pm Editor : manabharath

మిగిలింది ఆరు రోజులే..!

ఓటును సురక్షితం చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్

నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమం మరో ఆరు రోజుల్లో ముగుస్తుందని నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు పాల్గొని తమ ఓటును సురక్షితం చేసుకో వాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ ఒక ప్రకటనలో ప్రజలకుపిలుపునిచ్చారు.ప్రజల నిర్లక్ష్యం వల్లే ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ దరఖాస్తు గడువు ఆగస్ట్ 3 వరకు పొడిగించింద న్నారు.అయినప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపడం లేదని అన్నారు.శ్రద్ధ చూపి ఎన్యూమరేషన్ దరఖాస్తు చేయకపోతే ఓటు గల్లంతు అవుతుందనిసూచించారు.అలాగే బి ఎల్ ఏ 2లు సహకరించి వేగవంతంవ చేయాలనికోరారు.నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తోందని అన్నారు. వంద శాతం సర్ ను పూర్తి చేసేందుకు బూత్ ల వారీ గా నియమించిన బిజెపి బి ఎల్ ఓ లు ఫారాలు భర్తీ చేసి సహకరించాలని కోరా రు.రాష్ట్ర పార్టీ అదేశాల మేరకు ఓటర్లు తమ వివరా లను అందజేసేందుకు ఆగస్ట్ 3 వరకు గడువు ఉందని,దీనిపై ఎలాంటి అపోహలు కలగకుండా గడువుకు ముందే సంబంధి త బిఎల్ఓలు, యువత సంబంధిత ప్రజలకు సరైన అవగాహన కల్పించి ఎస్ఐ ఆర్ ప్రక్రియను వందశాతం విజయవంతం చేయాలని కోరారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.