manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 11:07 pm Editor : manabharath

విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం

విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం

-మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

మన భారత్,మొగుళ్ళపల్లి:

నీట్ యూజీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ,అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విడనాడి విద్యార్థుల పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మన భారత్ న్యూస్ తో మాట్లాడారు.పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించాలని మండిపడ్డారు.నీట్ పరీక్ష లీకేజీ తో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. న్యాయపరమైన డిమాండ్ తో లక్షలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అమానుషంగా పోలీసులు లాఠీ చార్జీ చేయడం హేయమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు.విద్యార్థుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలకు 22 లక్షల, 79వేల743 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని,తీరా పేపర్ లీక్ వ్యవహారంలో లక్షలాది మంది తీవ్ర నష్టపోయారని ఆయన ఆరోపించారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్ మొగుళ్ళ పల్లి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి