బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిపై ఇచ్చోడ పోలీసులు చర్యలు చేపట్టారు. గతంలో అక్రమంగా మద్యం విక్రయించిన కేసులో బైండోవర్లో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యక్తికి తహసీల్దార్ రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని సంబంధిత వ్యక్తి చెల్లించినట్లు ఇచ్చోడ ఎస్హెచ్ఓ కె. నరేష్ కుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన...