ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా
డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలి
మన భారత్, జూలై 23 ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన డబుల్ ఓటర్లు వెంటనే తమకు అనుకూలమైన ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, అయితే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఓటరు జాబితాల్లో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడారు. జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన వ్యక్తులు తమ ఓటును ఒకే ప్రాంతంలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
డబుల్ ఓటర్లుగా గుర్తించిన వ్యక్తులు మరో ప్రాంతంలోని ఓటును తొలగించేందుకు అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను సిద్ధం చేసి, రెండు నుంచి మూడు రోజుల్లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు నమోదుకాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
