manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:17 pm Editor : manabharath

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వం నిషేధించబడిన ఐడీ లిక్కర్ (గుడుంబా) తయారీ, నిల్వ రవాణా విక్రయాలపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా మంగళవారం, బుధవారం ఎస్ఐ ముప్పు సురేష్ ఆధ్వర్యంలో పర్లపల్లి గ్రామంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 3 వ్యక్తులు కథాల ప్రమీల వద్ద 4 లీటర్లు, దేవులపల్లి సరోజన వద్ద 3 లీటర్లు, జోరుక లలిత వద్ద 4 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను వారి నివాసాలలో అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి వద్ద నుండి మొత్తం 11 లీటర్ల గుడుంబా (అంచనా విలువ) 4,400 రూపాయల విలువ గల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన 3 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..