రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ
మన భారత్, హైదరాబాద్:
మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటి విడుదల చేయడం లేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్యల నేపథ్యంలో ఆమె ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించి సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతుల పంటలు ఎండిపోతున్నా, వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
సాగునీటి అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆమె అన్నారు. పంటలను కాపాడేందుకు అవసరమైన ప్రాంతాలకు వెంటనే నీటి సరఫరా చేయాలని, వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు మరింత భరోసా కల్పించేలా ఉండాలని కవిత అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రస్తుతం సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీల పరిస్థితి వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వారి వెంట టీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాప్ రిపోర్టర్స్, నియోజకవర్గాలు, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
