manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 4:04 pm Editor : manabharath

అంకిత భావంతో పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే

బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియామకంపై కవితను కలిసిన రాథోడ్ బాపురావు

పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ – నందినగర్ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ

మన భారత్, ఆదిలాబాద్:

తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ ఇంచార్జీలను ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు పుష్పగుచ్ఛం అందజేసి, తనపై నమ్మకం ఉంచి బోథ్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

బోథ్ నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు యువత, మహిళలు, రైతులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానం చేసే దిశగా కృషి చేస్తానని రాథోడ్ బాపురావు వెల్లడించారు. పార్టీ విస్తరణ కోసం కార్యకర్తలతో సమన్వయం పెంచి సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రక్షణ సేన రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ వివిధ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించే చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.